ప్రతి ఒక్కరిని గుర్తు పెట్టుకుంటాం, ఎవ్వరినీ వదిలిపెట్టం : యరపతినేని

-

ఈ రోజు గుంటూరు జిల్లా మాచవరం మండలంలో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత యరపతినేని పర్యటించారు. ఈ సంధర్భంగా ప్రత్యర్థులు నరికి వేసిన టిడిపి నేతకు చెందిన బొప్పాయి పంటని పరిశీలించారు. బాధిత రైతుకు ధైర్యం చెప్పిన యరపతినేని, రాయల సీమ సంస్కృతిని పల్నాడుకు తీసుకువచ్చారని అన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక టిడిపి నేతలను ఆర్దికంగా దెబ్పతీసే ప్రయత్నం చేస్తున్నారని యరపతినేని అన్నారు.

ఆరు నెలల్లో మీ నాయకుడు జగన్ పరిస్థితి ఏంటో తేలుతుందని, మీ ఎమ్మెల్యే కాసు వచ్చే ఎన్నికలలో ఇక్కడ నుంచి పోటీ చేయడని అన్నారు. మీ నాయకుడిని నమ్నుకుని టిడిపి నేతలపై దాడులు చేస్తున్నారని, దాడులు చేసే ప్రతి ఒక్కరిని గుర్తు పెట్టుకుంటాం. ఎవ్వరిని వదిలిపెట్టమని అన్నారు. అక్రమ కేసులు పెట్టే పోలీసు అధికారులపై కూడా చట్ట పరంగా పోరాటం చేస్తామని యరపతినేని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version