జగన్ ఇంటిపై వైసీపీ కార్యకర్తలు దాడి చేయాలి : అచ్చెన్నాయుడు

-

నిన్న హిందూపురం లోని బాలకృష్ణ ఇంటి వద్ద.. వైసిపి కార్యకర్తలు రచ్చ చేసిన సంగతి తెలిసిందే. డంపు యార్డ్ కారణంగా.. ఈ వివాదం చెలరేగింది. అయితే ఈ ఘటనపై తాజాగా తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చం నాయుడు జగన్ సర్కార్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. హిందూపురం అభివృద్ధిపై స్థానికులు ప్రశ్నిస్తే ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటిపైకి వైసీపీ రౌడీలు దాడికి ప్రయత్నించాయని.. రాష్ట్రాన్ని లూఠీ చేసిన జగన్ ఇంటిపై వైసీపీ కార్యకర్తలు దాడి చేయాలని పిలుపు నిచ్చారు అచ్చెన్నాయుడు.

జగన్ ముఠా చర్యలను ఖండిస్తున్నామని.. భౌతిక దాడులు పెరిగాయని డీజీపీ విడుదల చేసిన క్రైమ్ రిపోర్ట్ చూసైనా పాలకులు సిగ్గు తెచ్చుకోవాలని అగ్రహించారు. రాష్ట్ర ప్రజలు అభివృద్ధి మర్చిపోయి రెండున్నరేళ్లు అయిందని.. ప్రజాప్రతినిధి నివాసంపైనే దాడికి పాల్పడితే ఇక సామన్యుల పరిస్థితి ఏంటి.? అని నిలదీశారు. భయపెట్టి పాలన సాగిస్తామంటే చూస్తూ ఊరుకోవాలా.? రాష్ట్రంలో టీడీపీ చేసిన అభివృద్ధి తప్ప వైసీపీ చేసింది ఎక్కడా మచ్చుతునకైనా లేదని విమర్శలు చేశారు అచ్చెన్నాయుడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version