వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన

-

ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యే, స్థానిక సంస్థల కోటాలో వైసీపీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రభుత్వ సలహాదారు సభ్యుల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. మొత్తం 18 మంది పేర్లను ఖరారు చేశామని తెలిపారు సజ్జల. స్థానిక సంస్థల కోటాలో 9, ఎమ్మెల్యేల కోటాలో 7, ఇద్దరు గవర్నర్ నామినేట్ అభ్యర్థులు ఉన్నారని తెలిపారు. వీరిలో బీసీలు 11, ఓసి 4, ఇద్దరు ఎస్సీలు, మరొకరు ఎస్టీ ఉన్నారని చెప్పారు.

ఈ జాబితాలో రామసుబ్బారెడ్డి ( కడప), కుడిపూడి సత్యనారాయణ( తూర్పుగోదావరి), నర్తు రామారావు (శ్రీకాకుళం), కౌరు శ్రీనివాస్ (పశ్చిమగోదావరి), ఎస్ మంగమ్మ (అనంతపురం) , వంకా రవీందర్ (పశ్చిమగోదావరి), మేరుగా మురళీధర్ (నెల్లూరు), సిపాయి సుబ్రహ్మణ్యం (చిత్తూరు), ఏ మధుసూదన్ (కర్నూలు ) ఉన్నారు. ఇక ఎమ్మెల్యే కోటా సూర్యనారాయణ రాజు, సునీత, గురువులు, ఇజ్రాయిల్, వెంకటరమణ, ఏసురత్నం, రాజశేఖర్ ఉన్నారు. గవర్నర్ కోటాలో రవిబాబు, పద్మశ్రీ ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version