BREAKING : ఆత్మకూరులో 82,742 మెజారిటీతో వైసీపీ ఘన విజయం

-

నెల్లూరు జిల్లా : ఆత్మకూరు ఉపఎన్నిక కౌంటింగ్ దాదాపుగా ముగిసింది. అయితే.. ఈ ఆత్మకూరుఉప ఎన్నికల్లో 82742 ఓట్ల మెజారిటీ తో మేకపాటి విక్రమ్ రెడ్డి ఘన విజయం సాధించారు. దీంతో భారీ మెజారిటీ వైసిపి గెలుపొందింది. 20 రౌండ్లు ముగిసే సరికి… 82,742 వేల మెజారిటీ వైసీపీ పార్టీకి వచ్చింది.

అటు ఆత్మకూరు ఉపఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయింది బీజేపీ పార్టీ. దీంతో బిజెపి అభ్యర్థి భరత్ కుమార్ కు ఓటమి తప్పలేదు. అయితే.. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి విక్రమ్ రెడ్డి మెజారిటీ లక్ష దాటలేదు. 82,888 ఓట్ల మెజారిటీకే పరిమితం అయింది వైసీపీ. దీంతో వైసీపీ నేతల్లో నిరాశ నెలకొంది. ఆశించిన విజయం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది వైసీపీ. అయితే.. ఈ ఎన్నికల్లో గణనీయంగా ఓట్లు సాధించింది బీజేపీ.

నెల్లూరు: ఆత్మకూరు ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి విక్రమ్ రెడ్డి ఘన విజయం.
వైసీపీకి – 82,888
బీజేపీ- 18,216
బీస్పీ -4773
నోటా – 3972

 

ఆత్మకూరు ఉప ఎన్నికలు.

64.26 శాతం పోలింగ్..
మొత్తం ఓట్లు- 2,13,338
పోలైనా ఓట్లు 1,37,081

Read more RELATED
Recommended to you

Exit mobile version