మాట మీద నిలబడే వ్యక్తి వైఎస్ జగన్ : కేశినేని నాని

-

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో విజయవాడ పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కేశినేని నాని ప్రచారంలో దూసుకెళ్తున్నారు.ఇవాళ విజయవాడ సెంట్రల్‌, జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులతో కలిసి కేశినేని నాని ప్రచారం నిర్వహించారు. మొదట విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్‌తో కలిసి కేశినేని నాని ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ…. ఒక మాట ఇస్తే మాట మీద నిలబడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కేశినేని నాని వెల్లడించారు. చంద్రబాబు నాయుడు పచ్చి మోసగాడు అని ప్రజలందరూ చెబుతున్న పరిస్థితి ఉందని అన్నారు.

బీజేపీతో సంబంధం లేకుండా మేనిఫెస్టో విడుదల చేశారు.. చంద్రబాబు ఇచ్చే హామీలు బీజేపీ కూడా నమ్మట్లేదని , అందుకనే మేనిఫెస్టో నుంచి వాళ్ళ సింబల్, వాళ్ల ఫోటోలు పార్టీ పేరు లేకుండా మేనిఫెస్టో డిలీట్ చేశారన్నారు. చంద్రబాబు నాయుడు చెప్పేవన్నీ అబద్ధాలేనని , వైసీపీ బ్రహ్మాండమైన మెజార్టీతో మళ్ళీ గెలవబోతోందని కేశినేని నాని ఆశా భావం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version