కవితకు రాజకీయ భిక్ష పెట్టింది వైయస్ఆర్ – వైఎస్ షర్మిల

-

ఎంపీ మాలోత్ కవితకు రాజకీయ భిక్ష పెట్టింది వైయస్ఆర్ గారని సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్‌ షర్మిల. అలాంటి మహిళ కనీసం కృతజ్ఞత లేకుండా వైయస్ఆర్ పై, వైయస్ఆర్ బిడ్డపై పిచ్చి ప్రేలాపనలు పేలుస్తోందని మండిపడ్డారు. కనీసం విజ్ఞత, సంస్కారం లేకుండా మాట్లాడుతుంది. మీకు దమ్ముంటే ఎంపీగా మహబూబాబాద్ కు చేసిందేంటో శ్వేతపత్రం విడుదల చేయండని కోరారు.


ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఒక లంచగొండి. ఏఈ ఉద్యోగం పోగొట్టుకొని, ఎమ్మెల్యేగా మారి, భూములన్నీ కబ్జాలు పెడుతుండు. లిక్కర్ మాఫియా, గుట్కా మాఫియా, ఇసుక మాఫియా, బెల్లం మాఫియా.. ఆఖరికి పీడీఎస్ రైస్ మాఫియాకు పాల్పడుతూ వేల కోట్లకు పడగలెత్తిండు. ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలు మాత్రం గాలికొదిలేశాడని ఆగ్రహించారు. ఎనిమిదేండ్లుగా కేసీఆర్ పోడు రైతులను మోసం చేస్తూనే ఉన్నాడు. కుర్చీ వేసుకొని పట్టాలు ఇస్తానని చెప్పి, తీరని ద్రోహం చేశాడు. పైగా పోడు రైతులు భూములు కొట్టేసేవారు, భూఆక్రమణదారులంటూ నీచంగా మాట్లాడాడు. ఇలాంటి సన్నాసి ముఖ్యమంత్రికి పోడు రైతులే గట్టి బుద్ధి చెప్పాలన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version