జగన్ సర్కార్ శుభవార్త..నేడు వారందరికి ఒక్కో అకౌంట్‌లో రూ.10వేలు

-

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలకు శుభవార్త..నేడే వైఎస్సార్‌ మత్య్సకార భరోసా నిధులు జమ కానున్నాయి. ఇందులో భాగంగానే.. ఇవాళ కోనసీమ జిల్లాలో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటించనున్నారు. కోనసీమ జిల్లా ఐ పోలవరం మండలం మురమళ్ళలో వైఎస్సార్‌ మత్య్సకార భరోసా కార్యక్రమానికి శ్రీకారం చుట్టననున్నారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి.

cm jagan

ఇందులో భాగంగానే… ఇవాళ ఉదయం 9.40 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి… 10.20 గంటలకు ఐ పోలవరం మండలం కొమరగిరి చేరుకోనున్నారు. 10.45 గంటలకు మురమళ్ళ వేదిక వద్దకు చేరుకుని వైఎస్సార్‌ మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు సీఎం జగన్ మోహన్‌ రెడ్డి. ఈ సందర్భంగా బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం జగన్‌… మధ్యాహ్నం 1.20 గంటలకు తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు. ఇక సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి.. కోనసీమ జిల్లా పర్యటన నేపథ్యంలో… అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా..అసని తుఫాన్‌ నేపథ్యంలో వైఎస్సార్‌ మత్య్సకార భరోసా నిధుల విడుదల ఇటీవల వాయిదా పడిన సంగతి తెలిసిందే.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version