నగరంలో మరో దారుణ ఘటన.. ప్రేమోన్మాది దాడిలో యువతి మృతి

-

హైదరాబాద్ మహానగరంలో మరోసారి దారుణ ఘటన చోటుచేసుకుంది. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతమైన గచ్చిబౌలిలో ఓ యువతి ప్రేమోన్మాది ఘాతుకానికి బలైంది.ప్రేమ పేరుతో తరుచూ వేధిస్తున్న యువకుడికి కొన్నాళ్లుగా యువతి దూరంగా ఉంటూ వస్తుండటంతో పగ పెంచుకున్న అతను ఆమె మీద కత్తితో దాడికి పాల్పడ్డాడు.

ఈ ఘటన గచ్చిబౌలి పరిధిలోని గోపన్ పల్లి తండా పరిధిలో గురువారం ఉదయం వెలుగులోకి వచ్చింది. యువతిపై ప్రేమోన్మాది దాడి చేస్తుండగా గమనించిన పలువురు అతన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే, నిందితుడు వారిపై కూడా దాడికి యత్నించినట్లు సమాచారం. ఈ దాడిలో మరో ముగ్గురికి కూడా తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది.

వారంతా ప్రస్తుతం స్థానికంగా ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, ప్రేమోన్మాది దాడిలో యువతి ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version