BIG BREAKING : ఎంపీ అవినాష్ రెడ్డికి బెయిల్ మంజూరు !

-

మూడు రోజుల నుండి ఎంతో ఉతకంతను కలిగిస్తున్న అంశం వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హై కోర్ట్ ముందస్తు బైలు ఇస్తుందా లేదా ? అయితే రెండు రోజుల నుండి విచారణ జరుగుతుండడంతో అవినాష్ రెడ్డికి బెయిల్ ఇవ్వడం కష్టం అన్న అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి. ఎందుకంటే ఒకవైపు సిబిఐ మరియు మరోవైపు సునీత అవినాష్ రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దని పిల్ వేసి పోరాడుతున్నారు. కాగా ఈ రోజు కాసేపటి క్రితం వరకు సిబిఐ మరియు అవినాష్ రెడ్డి తరపున లాయర్ ల మధ్యన వాదనలు జరిగాయి. అలా మగ్గుతున్న ఈ పిటీషన్ లో కాసేపటి క్రితమే అవినాష్ రెడ్డికి అనుకూలంగా తీర్పు రావడం సంచలనంగా మారింది. కడప ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డికి తెలంగాణ హై కోర్ట్ ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది.

అంతే కాకుండా సిబిఐ కు అవినాష్ రెడ్డిని ఈ నెల 25 వరకు అరెస్ట్ చేయవద్దంటూ ఆదేశించింది. ఇప్పుడు రేపు విచారణ చేస్తాం అని ప్రకటించిన సిబిఐ ఏ నిర్ణయం తీసుకోనుంది ? కోర్ట్ తీర్పుకు లోబడి మరో వారం రోజులు ఆగుతుందా ? లేదా దీనిపైన సవాల్ కు వెళుతుందా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news