మహాత్ముడి బోధనలు.. మన మార్గాన్ని వెలిగించాయి: గాంధీజీకి మోదీ నివాళి

-

జాతిపిత మహాత్మాగాంధీ 154వ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ప్రముఖులు మహాత్ముడికి నివాళులు అర్పిస్తున్నారు. యావత్‌ భారతదేశం ఇవాళ గాంధీజీని స్మరించుకుంటోంది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వంటి ప్రముఖులు దిల్లీలోని రాజ్‌ఘాట్‌కు చేరుకుని గాంధీజీ స్మారకస్థలి వద్ద నివాళులు అర్పించారు. భారతీయులతో పాటు పలువురు విదేశీ నేతలు, ప్రతినిధులు కూడా మహాత్ముడి సేవలను గుర్తుచేసుకుని సోషల్ మీడియాలో ఆయనకు అంజలి ఘటిస్తున్నారు.

‘‘గాంధీజీ సిద్ధాంతాలు కేవలం ఆలోచనల్లో నుంచి వచ్చినవి కాదని.. నిరంతర అభ్యాస ఫలితాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. ఆయన సిద్ధాంతాల ప్రకారం.. జీవితానికి ఉపయోగపడని తత్వం.. ‘ధూళి లాంటి నిర్జీవమైనదే’నని పేర్కొన్నారు. గాంధీ మహాత్ముడి మాటలు, చేతలు, ఆలోచనల్లో ఐకమత్యమే స్ఫురించేదని.. అందుకే నేటికీ ఆయన ఆలోచనలు మనకు ఉపయోగపడుతున్నాయని ముర్ము తెలిపారు.

మరోవైపు.. గాంధీ జయంతి సందర్భంగా ఆ మహాత్ముడికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని ప్రధాని మోదీ అన్నారు. ఆయన బోధనలు మన మార్గాన్ని ఎల్లప్పుడూ ప్రకాశింపజేస్తూనే ఉంటాయని.. యావత్ ప్రపంచంపై ఆయన చెరగని ముద్ర వేశారని చెప్పారు. ఐకమత్య స్ఫూర్తి, దయ వంటి గుణాలను మరింత వ్యాప్తి చేసేలా మానవాళిని ప్రేరేపించారని.. ఆయన కలలను సాకారం చేసేందుకు మనం కృషి చేద్దామని ప్రధాని పిలుపునిచ్చారు. “గాంధీ సిద్ధాంతాలను అనుసరిస్తూ మన మధ్య ఐకమత్యాన్ని, సామరస్యాన్ని పెంచుకుందాం. యువత కలలను నేరవేరుద్దాం’’ అంటూ ప్రధాని మోదీ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news