ఇవాళ్టి తెలంగాణలో కేంద్ర మంత్రుల ఎన్నికల ప్రచారం

-

ఇవాళ్టి తెలంగాణలో కేంద్ర మంత్రులు ఎన్నికల ప్రచారం చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భాగంగా పలువురు కేంద్రమంత్రులు తెలంగాణలో పర్యటించి విస్తృత ప్రచారంలో పాల్గొననున్నారు. ఇవాళ కేంద్రమంత్రి సాధ్వినిరంజన్ జ్యోతి ముషీరాబాద్ పర్యటనలో భాగంగా మత్స్యకారులతో సమావేశంలో పాల్గొంటారు. అనంతరం అంబర్ పేటలో మత్స్యకారులతో సమావేశంలోనూ పాల్గొంటారు.

Election campaign of Union Ministers in Telangana today

అక్టోబర్ 16వ తేదీన కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంటలో జరగనున్న బహిరంగసభలో పాల్గొని ప్రసంగించనున్నారు. అనంతరం మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్ పేట్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అక్టోబరు 16వ తేదీన కేంద్ర మత్స్య, పాడి పరిశ్రమ, పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాల రంగారెడ్డి జిల్లాలోని కడ్తాల్ మండల బిజెపి కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం కల్వకుర్తిలో జరగనున్న బిజెపి బహిరంగ సభలో పాల్గొంటారు.

Read more RELATED
Recommended to you

Latest news