BREAKING : BRS కు మరో షాక్‌..కాంగ్రెస్‌ పార్టీలో చేరిన బోథ్ ఎమ్మెల్యే !

-

BRS పార్టీకి మరో షాక్‌ తగిలింది. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు కూడా బీఆర్‌ఎస్‌ పార్టీకి దూరం కానున్నారు. తాజాగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిగారిని కలిశారు బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు చేరినట్లు సమాచారం అందుతోంది.

MLA Rathod Bapurao met TPCC President Revanth Reddy
MLA Rathod Bapurao met TPCC President Revanth Reddy

అంతేకాదు.. బోథ్‌ ఎమ్మెల్యే టికెట్‌ కూడా రాథోడ్ బాపూరావు ఇచ్చేందుకు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా సీఎం కేసీఆర్‌ ప్రకటించిన టికెట్లలో.. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు కు నిరాశే ఎదురైంది. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున ఈ సారి బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు స్థానంలో అనిల్‌ జాదవ్‌ ను బరిలోకి దింపింది బీఆర్‌ఎస్‌ పార్టీ. దీంతో… బీఆర్‌ఎస్‌ పార్టీపై బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు అసంతృప్తిగా ఉన్నారు. ఈ తరుణంలోనే.. ఇవాళ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిగారిని కలిశారు బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు.

Read more RELATED
Recommended to you

Latest news