BREAKING : మధ్యాహ్నం 1 గంటకు అమర వీరుల స్తూపం వద్దకు రేవంత్ రెడ్డి..

-

BREAKING : టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు అమర వీరుల స్తూపం వద్దకు రానున్నట్లు టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి వెల్లడించారు. మధ్యాహ్నం 12 గంటలకు సీఎల్పీ కి వచ్చి అక్కడి నుంచి ఒంటిగంటకు అమరవీల స్థూపం వద్దకు రానున్నారు రేవంత్ రెడ్డి.

revanth-reddy-cm-kcr

రెండు రోజుల క్రితం కేసీఆర్ కు సవాల్ చేసిన రేవంత్ రెడ్డి.. ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు అమర వీరుల స్తూపం వద్దకు రానున్నట్లు టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి వెల్లడించారు. అమరవీల స్థూపం వద్ద ప్రమాణం చేద్దాం రమ్మని రేవంత్ రెడ్డి చేసిన సవాల్ కు అనుగుణంగా మధ్యాహ్నం ఒంటిగంటకు అమరవీరుల స్తూపం వద్దకు రానున్నారు. అయితే.. ఇవాళ సిద్దిపేట, సిరిసిల్లా జిల్లాలలో BRS ప్రజా ఆశీర్వాద సభ జరుగనుంది. ఈ తరుణంలోనే.. ఈ రెండు సభల్లో సీఎం కేసీఆర్‌ పాల్గొంటారు. ఇందులో భాగంగానే ఇవాళ సాయంత్రం 4 గంటలకి సభకి హాజరుకానున్నారు సీఎం కేసీఆర్. దీంతో గులాబీమయంగా మారింది సిద్దిపేట. ఈ సందర్భంగా 20 వేల మందితో BRS కార్యకర్తల భారీ బైక్ ర్యాలీ ఉండబోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news