ఈ నెల 28న కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన

-

కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ నెల 28న కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. మూడ్రోజులపాటు కుప్పంలో పర్యటించనున్న చంద్రబాబు…. ఈ నెల 29, 30 తేదీల్లో నేతలు, కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. అరెస్టు తరువాత కుప్పంలో తొలిసారిగా బాబు పర్యటించనున్నారు.

TDP chief Chandrababu’s visit to Kuppam on 28th of this month

కాగా.. నిన్న మీడియాతో చంద్రబాబు మాట్లాడారు. వచ్చే ఎన్నికలు వైసీపీ – టీడీపీ, జనసేన మధ్య జరిగే ఎన్నికలు కావన్నారు. వచ్చే ఎన్నికలు వైసీపీకి ప్రజలకు మధ్య జరిగేవని వివరించారు. నా కోరికంతా తెలుగు జాతి నెంబర్-1గా ఉండాలనేనని చెప్పారు.

తెలంగాణలో ప్రభుత్వాలు మారినా అభివృద్ధిని ఆపలేదని చెప్పారు. ఏపీలో అమరావతిని ఏం చేశారో చూస్తూనే ఉన్నామని..వి‍శాఖకు రాజధాని తరలింపుపై హైకోర్టు మొట్టి కాయలు వేసిందన్నారు. అయినా ఈ ప్రభుత్వానికి సిగ్గు లేదు.. ఏదేదో మాట్లాడుతుంది….ఈ ప్రభుత్వ అడ్డగోలు విధానాలపై అన్ని వర్గాల వారు ఆలోచించాలని పేర్కొన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ కోసం ఒక మెట్టు దిగి ముందుకు పోతాం.. పార్టీ నేతలు కూడా అదే ఆలోచించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news