కేసీఆర్ కుటుంబం లక్షల కోట్లు దోచుకున్నారు..!

-

పదేళ్ల పాలనలో కెసిఆర్ ఫ్యామిలీ లక్షల కోట్ల రూపాయలని దోచుకున్నారని రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కేసీఆర్ కుటుంబం బంగార మయమైందని తెలంగాణ అప్పులు కుప్పగా మారిందని మండిపడ్డారు. కల్వకుంట్ల కవిత గల్లీలో బతుకమ్మ ఆటలు ఢిల్లీలో మద్యం అమ్మకాలు చేస్తుందని ఎద్దేవా చేశారు. పుట్టిన ఊరు కన్నతల్లి లాంటిదని గ్రామంలో పర్యటిస్తుంటే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయని బలగం మూవీని గుర్తు చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు.

250 కోట్లు బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుకి మంజూరు చేయించానని వర్షాకాలంలోపు ప్రాజెక్టుని పూర్తి చేసి సాగునీటిని అందిస్తానని పూర్తి హామీ ఇచ్చారు. ప్రాజెక్టు పూర్తి చేస్తే కోమటిరెడ్డి కి పేరు వస్తుందని పదేళ్లు నిధులు మంజూరు చేయకుండా కేసీఆర్ కుట్రలు పన్నారని ఫైర్ అయ్యారు 69 కోట్ల రూపాయలతో నిర్మించే రోడ్డు నిర్మాణ పనులకి ఎమ్మెల్యే వేముల వీరేశం తో కలిసి శుక్రవారం చేపట్టిన శంకుస్థాపన కార్యక్రమంలో ఈ విధంగా మాట్లాడడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news