సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మహమ్మద్ సిరాజ్

-

Mohammed Siraj met CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు టీం ఇండియా క్రికెటర్ మహమ్మద్ సిరాజ్. టి 20 ప్రపంచ కప్ సాధించినందుకు సిరాజ్ ను అభినందించారు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి. ఇందులో భాగంగానే..హైదరాబాద్‌ లోని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇంటికి టీం ఇండియా క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ వచ్చారు.

Mohammed Siraj met CM Revanth Reddy

అనంతరం టిం ఇండియా జెర్సీ ని సీఎం రేవంత్ రెడ్డి కి బహుకరించారు సిరాజ్. ఈ కార్యక్రమంలో… ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో పాటు మంత్రి కోమటి రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి  కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్‌ గా మారాయి.

కాగా, టి 20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత.. టీం ఇండియా క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ మొన్న హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా టీం ఇండియా క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ కు గ్రాండ్‌ వెల్‌ కం లభించింది.

Read more RELATED
Recommended to you

Latest news