Vemulawada: మరో వివాదంలో మంత్రి కొండా సురేఖ

-

తెలంగాణ రాష్ట్ర మహిళా మంత్రి కొండా సురేఖ మరో వివాదంలో ఇరుక్కున్నారు. మంత్రి కొండా సురేఖ కోసం వేములవాడలో స్వామి వారికి నైవేద్యాన్ని ఆపేశారు అధికారులు. దీంతో అక్కడే ఉన్న మహిళా భక్తులు తెలంగాణ రాష్ట్ర మహిళా మంత్రి కొండా సురేఖ పై ఆగ్రహించారని సమాచారం. దసరా పండుగ నేపథ్యంలో.. వేములవాడ రాజన్న సన్నిధికి వెళ్లారు తెలంగాణ రాష్ట్ర మహిళా మంత్రి కొండా సురేఖ కుటుంబ సభ్యులు.

Officials stopped offering to Swami at Vemulawada for Minister Konda Surekha

ఈ సందర్భంగానే.. కొండా సురేఖ మరో వివాదంలో ఇరుక్కున్నారు. సోమవారం ద్వాదశి సందర్భంగా స్వామివారికి మూడు గంటలకు నైవేద్యం సమర్పించాల్సి ఉండగా.. 30 నిమిషాలు ఆలస్యంగా రాజన్న స్వామి వారికి నివేదన సమర్పించారు అర్చకులు. స్వామి వారి నైవేద్యాన్ని ఆపి మరి మంత్రి కొండా సురేఖకు ప్రత్యేక పూజలు చేయించారు అధికారులు. దీంతో మంత్రి, అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు భక్తులు.

Read more RELATED
Recommended to you

Latest news