వల్లభనేని వంశీపై కిడ్నాప్ కేసు నమోదు అయింది. ఈ తరుణంలోనే.. వల్లభనేని వంశీపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి బెదిరింపులకు పాల్పడినట్లు వల్లభనేని వంశీ పై కేసు పెట్టారు.. మొత్తం 7 సెక్షన్ల కింది కేసు నమోదు చేశారు విజయవాడ పటమట పోలీసులు.. 140, 308, 351 రెడ్ విత్ 3 (5) సెక్షన్ల కింద వంశీపై కేసు అయింది. ఈ తరుణంలోనే… ఇవాళ ఉదయం హైదరాబాద్ లో ఉన్న వల్లభనేని వంశీని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2025/02/vamshi.jpg)
కాగా…. వల్లభనేని వంశీ అరెస్ట్ పై X వేదికగా స్పందించింది వైసీపీ పార్టీ. వంశీపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని… గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో వంశీకి ముందస్తు బెయిల్ ఉందని గుర్తు చేసింది వైసీపీ. ఇటీవల సత్యవర్థన్ కూడా ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారని. చంద్రబాబు.. ఇంకెన్నాళ్లు ఈ కక్షపూరిత రాజకీయాలు అంటూ ఆగ్రహించింది వైసీపీ పార్టీ.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్
గచ్చిబౌలిలో తన నివాసంలో అరెస్ట్ చేసి విజయవాడ తరలిస్తున్న ఏపీ పోలీసులు
BNS సెక్షన్ 140(1), 308, 351(3), రెడ్ విత్ 3(5), ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిన పోలీసులు https://t.co/HTvHy31UXD pic.twitter.com/WVrlHDrg9Q
— Telugu Scribe (@TeluguScribe) February 13, 2025