జీవోలు ఎటు పోతున్నాయ్.. రెవెన్యూపై మంత్రి పొంగులేటి సీరియస్

-

రాష్ట్ర రెవెన్యూ యంత్రాంగంపై ఆశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం జారీ చేస్తున్న జీవోలు పోర్టల్‌లో ఎందుకు కనిపించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం ఆయన మాట్లాడుతూ.. ‘జీవోలు ఎటు పోతున్నాయి..! వందలకొద్దీ విడుదలవుతున్నా పోర్టల్‌లో కనిపించని జీవోలు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత 2024 సంవత్సరంలో రెవెన్యూ శాఖలో విడుదలైన జీవోలు 603 కాగా ఇందులో 100 మాత్రమే పోర్టల్‌లో పెట్టారు. అసలే అవినీతి ఆరోపణలు అధికంగా ఉండే శాఖ రెవెన్యూ కాగా ఇలా జీవోలు బైటికి రాకుండా చేస్తుండటంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి’ అని ఆయన వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news