మన రోజువారీ ఆహారంలో స్నాక్స్ ఒక భాగమైపోయాయి. ఆరోగ్యం కోసం చాలామంది పల్లీలను (వేరుశనగలు) ఇష్టంగా తింటుంటారు. ప్రోటీన్లు, విటమిన్లు, ఫైబర్ పుష్కలంగా ఉండే పల్లీలు బరువు తగ్గడానికి, తక్షణ శక్తికి ఎంతగానో ఉపయోగపడతాయి. కానీ, ఎంత ఆరోగ్యకరమైనవైనా సరే.. కొంతమందికి పల్లీలు విషంతో సమానం! ముఖ్యంగా కాలేయ సమస్యలు, హై బీపీ, యూరిక్ యాసిడ్ ఉన్నవారు పల్లీలను తింటే అనారోగ్య సమస్యలు మరింత తీవ్రమవుతాయి. అసలు పల్లీలు ఎందుకు తీసుకోకూడదో వివరంగా చూద్దాం.
పల్లీలు ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాలు: సాధారణంగా పల్లీలను ఆరోగ్యకరమైన స్నాక్గా పరిగణిస్తారు. వీటిలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇక పల్లీలు తింటే కడుపు నిండిన భావన కలిగి అతిగా తినకుండా ఉంటాం. నానబెట్టిన పల్లీలు తినడం వల్ల మెటబాలిజం పెరుగుతుంది, శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అయితే ఇవన్నీ ఆరోగ్యంగా ఉన్నవారికి మాత్రమే వర్తిస్తాయి.

ఉన్నవారు ఎందుకు దూరంగా ఉండాలి?: కాలేయ సమస్యలతో బాధపడేవారు పల్లీలకు దూరంగా ఉండటం చాలా అవసరం. పల్లీలలో క్యాలరీలు, ఫ్యాట్ (కొవ్వు) శాతం ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల జీర్ణ ప్రక్రియ నెమ్మదించి, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు వస్తాయి. ఇక జీర్ణవ్యవస్థపై మరియు లివర్పై తీవ్రమైన ఒత్తిడి పడటం వల్ల కాలేయ సంబంధిత సమస్యలు మరింత పెరుగుతాయి.
హై బీపీ బాధితులకు ప్రమాదకరం: హై బీపీ (రక్తపోటు) ఉన్నవారు ముఖ్యంగా వేయించిన, ఉప్పు కలిపిన పల్లీలను అస్సలు తినకూడదు. ఇక వీటిలో సోడియం శాతం ఎక్కువగా ఉండటం వల్ల రక్తపోటు హఠాత్తుగా పెరిగే ప్రమాదం ఉంది. పల్లీలు తినాలనిపిస్తే కేవలం ఉప్పు లేని లేదా ఉడకబెట్టిన పల్లీలను మాత్రమే అప్పుడప్పుడు తీసుకోవడం మంచిది.
యూరిక్ యాసిడ్, అలర్జీ సమస్యలు: యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువగా ఉన్నవారు పల్లీలు తింటే వాటిలోని అధిక ప్రోటీన్ వల్ల కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ ఇబ్బందులు పెరుగుతాయి. అలాగే పల్లీల అలర్జీ ఉన్నవారు వీటి పొడిని గానీ, వేరుశనగలను గానీ తింటే చర్మంపై దురదలు, వాపులు వస్తాయి.
ఇక పల్లీలు ఎంతో పోషకాలు కలిగిన ఆహారమే అయినప్పటికీ, మీ శరీర తత్వానికి మరియు ఉన్న అనారోగ్య సమస్యలకు తగినట్లుగా ఆహారాన్ని ఎంచుకోవడం ముఖ్యం. కాలేయ, బీపీ, కీళ్ల నొప్పుల సమస్యలు ఉన్నవారు పల్లీలను తినే ముందు ఖచ్చితంగా డాక్టర్ సలహా తీసుకోవడం శ్రేయస్కరం.
