హైదరాబాద్ సిటీ నడిఒడ్డున గల నెక్లెస్ రోడ్డులో ఏడాది కిందట ఏర్పాటు చేసిన రైల్ కోచ్ రెస్టారెంట్ బిర్యానీలో బొద్దింకలు దర్శనమిచ్చాయి.దీంతో వినియోగదారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. విజయ్ అనే వ్యక్తి తన మిత్రులతో కలిసి బిర్యానీ తినేందుకు ఆ హాటల్కు వెళ్లాడు.
బిర్యానీ ఆర్డర్ చేశాడు. అయితే,వాళ్లు తీసుకొచ్చిన బిర్యానీ సగం తిన్నతర్వాత అందులో బొద్దింక కనపడింది. ఇదేంటని రెస్టారెంట్ నిర్వాహకులను ప్రశ్నించగా.. వారి నుంచి సరైన సమాధానం రాలేదని సమాచారం. దీంతో విజయ్ ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే ఈ హోటల్ మీద చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిసింది.
నెక్లెస్ రోడ్డులోని రైల్ కోచ్ రెస్టారెంట్లో బిర్యానిలో బొద్దింకలు
బిర్యాని తినడానికి తన ఫ్రెండ్స్తో కలిసి రెస్టారెంట్కి వెళ్ళిన విజయ్ అనే వ్యక్తి
సగం బిర్యాని తిన్న తర్వాత బయటపడ్డ బొద్దింక
రెస్టారెంట్ నిర్వాహకులను ప్రశ్నించి.. ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసిన కస్టమర్స్ pic.twitter.com/T4gjHScnIm
— Telugu Scribe (@TeluguScribe) March 18, 2025