బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న అంతర్గత పాలిటిక్స్ మీద టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన గురువారం ‘ఎక్స్’ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు.‘బీఆర్ఎస్ లో మారుతున్న రాజకీయ పరిణామాలు, మాజీ మంత్రి హరీశ్రావు స్థానంలో ఎమ్మెల్సీ కవిత? నేడు వరంగల్ సభ ఏర్పాట్లలో కవిత ఫుల్ యాక్టివ్. హరీశ్ రావును దూరం పెడుతున్న గులాబీ బాస్? నేడు సభకి.. భవిష్యత్తులో బీఆర్ఎస్కి.. ఇక హరీష్ దూరమేనా?

అనూహ్య మలుపులు తిరుగుతున్న గులాబీ ఫ్యామిలీ పాలిటిక్స్’ అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. హరీశ్రావు, కవిత ఫోటోలను షేర్ చేశారు. రామ్మోహన్ ట్వీట్ను బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా ఖండించాయి. సబ్జెక్ట్ లేక చిల్లర పోస్టులతో రాజకీయాలు చేస్తున్నావు అని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి. మీరు ప్రజల గురించి ఆందోళన చెందాలి, ఒక నెల నుంచే మాజీ మంత్రి హరీశ్రావు వరంగల్ సమావేశ స్థలాన్ని 3 సార్లకు పైగా సందర్శించారని, పార్టీ ఇన్చార్జ్గా ఉన్నారని గులాబీ లీడర్లు స్పందిస్తున్నారు.