తెలంగాణ ప్రభుత్వం మీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీమంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న సీఎం రేవంత్ పోలీసులకు అవార్డుల ప్రదానం కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఉద్యోగులు ఎవరి మీద సమరానికి దిగుతున్నారని.. ఒకటో తారీఖునే జీతాలు ఇస్తున్నాం కదా.. మీరు నన్ను కోసుకుని తిన్నా ఒక్క రూపాయి లేదని అన్న విషయం తెలిసిందే.
తాజాగా ఇదే విషయంపై తెలంగాణ భవన్ వేదికగా మంగళవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. మాజీ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వడానికి, బెనిఫిట్స్ చెల్లంచడానికి పైసలు లేకపోతే అందాల పోటీలకు రూ.250 కోట్లు పెట్టడానికి డబ్బులు ఎలా ఉన్నాయని ప్రశ్నించారు. రిటైర్ అయిన ఉద్యోగులకు ఇవ్వడానికి డబ్బులు లేవా? నిన్ను కోసుకొని తినడం కాదు.. నువ్వే రాష్ట్రాన్ని పీక్కొని తింటున్నావ్ అని విమర్శించారు. మీ తలకు మాసిన విధానాల వల్లే రాష్ట్రం ఇలా తగలబడిందని ఫైర్ అయ్యారు.