బీటెక్ లో 4 సబ్జెక్టులు ఫెయిల్ కావడంతో.. విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. బీటెక్ మొదటి సెమిస్టర్లో 4 సబ్జెక్టులు మిగిలాయని మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం సమీపంలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతోంది విద్యార్థిని పరుచూరి ప్రగతి (19).

మొదటి సెమిస్టర్లో నాలుగు సబ్జెక్టులు మిగిలాయని మనస్తాపంతో సూసైడ్ నోట్ రాసి, తన హాస్టల్ గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది ప్రగతి. ఇక ఈ సంఘటన పై కేసు నమోదు హెసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.