జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మేడిగడ్డ బ్యారేజీ వద్ద గోదావరిలో 6 గురు యువకులు గల్లంతు అయ్యారు. గోదావరిలో ఈత కోసం వెళ్లి సెల్ఫీలు దిగుతూ 6 గురు యువకులు గల్లంతు అయ్యారు. గల్లంతైన యువకుల కోసం రెస్క్యూ బృందం గాలించారు.

సెల్ఫీలు దిగుతూ 6 గురు యువకులు గల్లంతు కాగా అందులో ఒక యువకుడిని గజ ఈతగాళ్లు కాపాడారు. గల్లంతైన వారు అంబటిపల్లికి వాసులుగా గుర్తించారు. గల్లంతైన ఆరుగురు 18 ఏళ్ల లోపు యువకులే కావడం గమనార్హం. అంబటిపల్లి, కొర్లకుంట గ్రామాలకు చెందిన మధుసూదన్ (18), శివ మనోజ్ (15), రక్షిత్ (13), సాగర్ ( 16), పండు (18) రాహుల్ (19) గా గుర్తించారు. ఇందులో రక్షిత్ మృతదేహం లభ్యం అయ్యింది. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి శ్రీధర్ బాబు… సహాయక చర్యలు ముమ్మరం చేయాలని కలెక్టర్, ఎస్పీకి ఆదేశాలు ఇచ్చారు.