ఇవాళ, రేపు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

-

నేటి నుంచి చేప మందు పంపిణీ జరుగనుంది. రెండు రోజుల పాటు చేప మందు పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేసింది తెలంగాణ రాష్ట్ర సర్కార్. ఇవాళ, రేపు చేప మందు పంపిణీ జరుగనుంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఉ.9 గంటల నుంచి చేప మందు ప్రసాదం చేసేందుకు 32 కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు.

Traffic diversions in place from today at Nampally
Traffic diversions in place from today at Nampally

మృగశిర కార్తె సందర్భంగా ఉబ్బసం వ్యాధిగ్రస్తుల కోసం ప్రతి ఏటా చేప మందు ప్రసాదాన్ని పంపిణీ చేస్తోంది బత్తిన కుటుంబం. చేప మందు కోసం వచ్చే ఆస్తమా రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు అధికారులు. నేటి నుంచి చేప మందు పంపిణీ ఉన్న తరుణంలో ఇవాళ, రేపు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. నాంపల్లి వైపు వెళ్లే వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలు గమనించుకుని వెళ్ల్లాలి.

  • MJ మార్కెట్ నుండి వచ్చే VIP కార్ పాస్ ఉన్నవారు అజంతా గేట్, గాంధీ భవన్ మీదుగా గేట్ నంబర్ 1 మరియు CWC గేట్ (VIP ఎంట్రీ) వైపు ఎడమ మలుపు తీసుకోవాలి.
  • MJ మార్కెట్ నుండి వచ్చే ద్విచక్ర వాహనదారులు మనోరంజన్ కాంప్లెక్స్ వద్ద పార్కింగ్ చేయాలి. నాంపల్లి నుండి వచ్చే వారు గృహ కల్ప మరియు BJP కార్యాలయం మధ్య రోడ్డుకు ఎడమ వైపున పార్కింగ్ చేయాలి.
  • షేజాన్ హోటల్, భవానీ వైన్స్, జువెనైల్ కోర్టు మరియు ఎక్సైజ్ కార్యాలయం సమీపంలో ఆటో-రిక్షా డ్రాప్-ఆఫ్ పాయింట్లు నియమించబడ్డాయి. కార్ల పార్కింగ్ రోడ్డుకు ఎడమ వైపున కేటాయించబడింది.
  • ఎం.జె. బ్రిడ్జి మరియు బేగమ్ బజార్ చత్రి నుండి నాంపల్లి వైపు వెళ్లే సాధారణ ట్రాఫిక్‌ను అలాస్కా వద్ద దారుస్సలాం, ఏక్ మినార్ మొదలైన వాటి వైపు మళ్లిస్తారు.
  • అత్యవసర పరిస్థితుల్లో లేదా ప్రయాణ సహాయం కోసం, దయచేసి ఈ ట్రాఫిక్ హెల్ప్ లైన్ నంబర్‌కు కాల్ చేయండి — 9010203626 .

Read more RELATED
Recommended to you

Latest news