ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత ప్రవేశాల గడువు పొడగించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రైవేట్ విద్యాసంస్థలలో ఉచిత ప్రవేశాల కోసం ప్రభుత్వం గడువు పెంచేందుకు రంగం సిద్ధం చేసింది. 25 శాతం సీట్లలో ఈ గడువు పెరగనుంది.

లాటరీ ద్వారా ఎంపికైన రెండో విడత జాబితా విద్యార్థుల తమ ప్రవేశాలను నిర్ధారించుకోవడానికి వచ్చే నెల రెండో తేదీ వరకు గడవు పొడగిస్తూ సమగ్ర శిక్ష ఎస్ పి డి బి శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఎంపికైన విద్యార్థుల తల్లిదండ్రులకు వాళ్లకు మెసేజ్ కూడా వస్తుందని తెలిపారు. పూర్తి వివరాల కోసం… 18004258599 ఫోన్ నెంబర్ ను సంప్రదించాలని సూచనలు చేశారు.