విశాఖ ఎక్స్ ప్రెస్ లో వరుసగా చోరీలు జరుగుతున్నాయి. తాజాగా పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం తుమ్మ చెరువు వద్ద విశాఖ ఎక్స్ ప్రెస్ లో చోరీకి దుండగులు యత్నం చేశారు. నిన్న ఉదయం ప్రయాణికుల బంగారం దొంగతనం చేశారు దుండగులు.

ఇక ఈ రోజు ఉదయం కూడా చోరీకి యత్నం చేశారు. అయితే దుండగులను పట్టుకునే క్రమంలో మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు రైల్వే పోలీసులు. పరారీలో బీహార్, మహారాష్ట్ర గ్యాంగ్ లు ఉన్నాయి. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.