తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వినాయక నిమజ్జనం చాలా అట్టహాసంగా జరుగుతోంది. చిన్న చిన్న ప్రమాదాలు మినహా… దాదాపు గణపతుల నిమజ్జనాలు పూర్తవుతున్నాయి. వేములవాడ అలాగే యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇప్పటికే గణపతుల నిమజ్జన కార్యక్రమం పూర్తయింది. అయితే ఈ నిమజ్జనాల నేపథ్యంలో చిన్న చిన్న సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి.

ఇందులో భాగంగానే యాదాద్రి భువనగిరి జిల్లాలో పెను ప్రమాదం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో నిన్న నిమజ్జనం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ కుమార్ కూడా పాల్గొన్నారు. ఈ తరుణంలోనే…. యాదాద్రి భువనగిరి జిల్లాలో క్రేన్ తెగి భక్తుల మీద పడింది వినాయక విగ్రహం. ఈ సంఘటన లో ఇద్దరికి గాయాలు అయ్యాయి.
షాకింగ్ వీడియో
యాదాద్రి భువనగిరి జిల్లాలో క్రేన్ తెగి భక్తుల మీద పడ్డ వినాయక విగ్రహం
ఇద్దరికి గాయాలు pic.twitter.com/ssLjUtyYD7
— Telugu Scribe (@TeluguScribe) September 5, 2025