డైలీహంట్, జోష్ వంటి టాప్ ప్లాట్ఫామ్ల మాతృసంస్థ ‘వెర్స్ ఇన్నోవేషన్’ (VerSe Innovation) కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థను మరింత బలోపేతం చేసే దిశగా ప్రముఖ ఆర్థిక నిపుణుడు పి.ఆర్. రమేష్ను ఇండిపెండెంట్ డైరెక్టర్గా, ఆడిట్ కమిటీ చైర్మన్గా నియమించింది. బెంగళూరు వేదికగా జరిగిన ఈ ప్రకటనతో కంపెనీ తన కార్పొరేట్ గవర్నెన్స్ను మెరుగుపరుచుకోవడమే కాకుండా, రాబోయే భారీ వ్యూహాత్మక వృద్ధికి గట్టి పునాది వేస్తోంది. రమేష్ గారి 40 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఈ టెక్ సంస్థకు పెద్ద అసెట్ కానుంది. ఆ వివరాలు చూద్దాం..
బోర్డులోకి దిగ్గజం.. సరికొత్త లక్ష్యాలు: భారతదేశపు అగ్రగామి ఏఐ (AI) లోకల్ లాంగ్వేజ్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ అయిన వెర్స్ ఇన్నోవేషన్, తన మేనేజ్మెంట్ బోర్డును మరింత పటిష్టం చేసుకుంది. పి.ఆర్. రమేష్ గారిని కేవలం డైరెక్టర్గానే కాకుండా, కంపెనీ ఆర్థిక లావాదేవీలను పర్యవేక్షించే ఆడిట్ కమిటీకి బాధ్యుడిగా నియమించింది.
నెక్స్ట్ లెవల్ గ్రోత్ కోసం సిద్ధమవుతున్న తరుణంలో ఇలాంటి అనుభవజ్ఞుడు తోడవ్వడం వల్ల సంస్థలో పారదర్శకత పెరుగుతుంది. ఇది కేవలం కంపెనీకే కాకుండా, ఇందులో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లకు కూడా పెద్ద భరోసానిస్తుందని కంపెనీ కో-ఫౌండర్ ఉమంగ్ బేడీ ఆశాభావం వ్యక్తం చేశారు.

నాలుగు దశాబ్దాల అపార అనుభవం: పి.ఆర్. రమేష్ గారికి ఆర్థిక మరియు కార్పొరేట్ రంగంలో దాదాపు 40 ఏళ్ల అనుభవం ఉంది. గతంలో ఆయన ‘డెలాయిట్ ఇండియా’కు చైర్మన్గా, డెలాయిట్ గ్లోబల్ బోర్డులో సభ్యుడిగా పనిచేశారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన ఆర్థిక నివేదికలు, రిస్క్ మేనేజ్మెంట్ మరియు నిబంధనల అమలుపై ఆయనకు తిరుగులేని పట్టు ఉంది.
ఎయిర్ ఇండియా, సిప్లా, నెస్లే, ఎల్ అండ్ టీ వంటి దిగ్గజ కంపెనీల బోర్డుల్లో కూడా ఆయన సభ్యుడిగా ఉన్నారు. 2022-23 సంవత్సరానికి గాను ఆయన ‘బెస్ట్ ఇండిపెండెంట్ డైరెక్టర్’ అవార్డును అందుకోవడం ఆయన ప్రతిభకు నిదర్శనం.
స్థానిక భాషల టెక్నాలజీలో సరికొత్త విప్లవం: టెక్నాలజీ ద్వారా డిజిటల్ విభజనను తొలగించాలనే లక్ష్యంతో వెర్స్ ఇన్నోవేషన్ దూసుకుపోతోంది. ఈ సంస్థ అభివృద్ధి చేసిన ఏఐ, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీలు కోట్లాది మంది భారతీయులకు తమ మాతృభాషలో కంటెంట్ను అందిస్తున్నాయి.
‘డైలీహంట్’ ద్వారా వార్తలు, ‘జోష్’ ద్వారా క్రియేటర్స్ వీడియోలు ఇలా వైవిధ్యమైన సేవలతో దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉంది. ఇప్పుడు కేవలం కంటెంట్ మాత్రమే కాకుండా నెక్స్ట్ వెర్స్ ఏఐ (NexVerse.ai) వంటి వినూత్న ఉత్పత్తుల ద్వారా గ్లోబల్ టెక్నాలజీ సంస్థగా ఎదుగుతోంది.
బాధ్యతాయుతమైన వృద్ధి దిశగా: భారతీయ భాషల టెక్నాలజీ రంగంలో మొట్టమొదటి ‘యూనికార్న్’గా నిలిచిన వెర్స్ ఇన్నోవేషన్లో గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజాలు పెట్టుబడులు పెట్టాయి. ఇప్పుడు రమేష్ గారి రాకతో సంస్థలో ఆర్థిక క్రమశిక్షణ, జవాబుదారీతనం మరింత పెరగనున్నాయి.
ఇక “గొప్ప సంస్థలు కేవలం ఆవిష్కరణలతోనే కాకుండా, క్రమశిక్షణతో నిర్మించబడతాయి” అని రమేష్ గారు చెప్పిన మాటలు కంపెనీ విజన్ను స్పష్టం చేస్తున్నాయి. సాంకేతికతకు సరైన గవర్నెన్స్ తోడైతే వెర్స్ ఇన్నోవేషన్ భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సృష్టించడం ఖాయం.
