లైఫ్‌లో కష్టాలు రిపీట్ అవుతున్నాయి ఎందుకు?.. గీత లో కృష్ణుడు చెప్పిన మాట

-

ఈరోజుల్లో ఎంతో మంది సమస్యలతో బాధపడుతూ వుంటారు. కొందరు నాకే ఎందుకు ఇలాంటి కష్టాలు వస్తున్నాయి? ఒక సమస్య తీరితే ఇంకోటి రెడీగా ఉంటోంది” అని చాలామంది బాధపడుతుంటారు. జీవితంలో కష్టాలు పదే పదే రిపీట్ అవ్వడానికి గల కారణాలను శ్రీకృష్ణుడు భగవద్గీతలో చాలా క్లియర్ గా వివరించాడు. కష్టాలను చూసి భయపడటం కాకుండా వాటి వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకుని ఎలా ముందుకు సాగాలో మనకు మళ్లీ మళ్లీ సమస్యలు ఎందుకు ఎదురవుతుంటాయో తెలుసుకుందాం..

సుఖదుఃఖాలు వస్తుంటాయి.. పోతుంటాయి: జీవితంలో కష్టాలు రావడం అనేది చాలా సహజమైన విషయం. ఎండ తర్వాత చలికాలం, రాత్రి తర్వాత పగలు ఎలాగైతే వస్తాయో.. సుఖాలు, దుఃఖాలు కూడా అంతే సహజంగా వస్తుంటాయి. ఇక వీటిని సమస్యలుగా కాకుండా, మనల్ని మనం మార్చుకోవడానికి ప్రకృతి ఇచ్చే అవకాశాలుగా చూడాలి. కష్టాలు వచ్చినా, సుఖాలు వచ్చినా ఒకేలా స్వీకరించే మనస్తత్వాన్ని (స్థితప్రజ్ఞత) అలవర్చుకోవాలని కృష్ణుడు బోధించాడు.

పాత కర్మల లెక్కలు తేలాల్సిందే: భగవద్గీతలో చెప్పిన కర్మ సిద్ధాంతం ప్రకారం.. మనం గతంలో (తెలిసి లేదా తెలియక) చేసిన మంచి, చెడు పనుల ఫలితాలను అనుభవించడానికే మనకు కష్టాలు ఎదురవుతుంటాయి. ఇక మన పాత కర్మల లెక్కలు పూర్తిగా సరిచేయబడే వరకు, అవే కష్టాలు లేదా అలాంటి పరిస్థితులే మన జీవితంలో పదే పదే వస్తుంటాయి. కర్మ ఫలాన్ని అనుభవించి తీరాల్సిందేనని గీత చెబుతోంది.

Why Do Problems Keep Repeating in Life? A Powerful Message from Krishna in the Gita
Why Do Problems Keep Repeating in Life? A Powerful Message from Krishna in the Gita

గుణపాఠం నేర్చుకోకపోతే అదే పరీక్ష: జీవితంలో ఒకే రకమైన కష్టం మళ్లీ మళ్లీ వస్తోందంటే.. ఆ కష్టం ద్వారా జీవితం మనకు ఏదో ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పాలని చూస్తోందని అర్థం. ఇక మనం చేసిన తప్పును సరిదిద్దుకోకుండా, సరైన గుణపాఠం నేర్చుకోనంత వరకు.. జీవితం మళ్లీ మళ్లీ అదే పరీక్షను మన ముందుకు తెస్తూనే ఉంటుంది. ఆ తప్పును గుర్తించి మారినప్పుడే ఆ సమస్య నుంచి మనకు విముక్తి లభిస్తుంది.

ఫలితాన్ని వదిలేయ్.. కర్తవ్యం ముఖ్యం: “కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు క్వాచన” అంటూ కృష్ణుడు అర్జునునికి ఒక గొప్ప రహస్యాన్ని చెప్పాడు. నీ పనిని నువ్వు శ్రద్ధగా, ధర్మబద్ధంగా చేసుకుంటూ పోవడమే నీ చేతుల్లో ఉంది కానీ, ఫలితం నీ చేతుల్లో లేదు. ఇక సమస్యలు వచ్చినప్పుడు ఫలితం గురించి ఎక్కువగా ఆలోచించి టెన్షన్ పడకుండా, మన బాధ్యతను మనం సరిగ్గా నిర్వర్తిస్తే కష్టాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు.

ఆధ్యాత్మిక పరిపక్వతకు ఇదొక సాధనం: భగవంతుడు తన భక్తులను పరీక్షించడానికి, వారిలో ఉండే అహంకారాన్ని (ఈగోను) తగ్గించడానికి కష్టాలను ఒక సాధనంగా వాడుకుంటాడట. కష్టాలు రావడం వల్ల మనిషిలో ఓర్పు, సహనం పెరుగుతాయి. ఇక అవి మనల్ని ఆధ్యాత్మికంగా మరింత పరిపక్వం చేస్తాయి. భగవంతునిపై పరిపూర్ణమైన నమ్మకంతో శరణాగతి పొందితే.. ఎలాంటి కష్టాన్నైనా తట్టుకునే కొండంత మానసిక శక్తి మనకు లభిస్తుంది.

ఇక లైఫ్‌లో కష్టాలు పదే పదే వస్తున్నాయంటే భయపడాల్సిన అవసరం లేదు. అవి మనల్ని భయపెట్టడానికి కాదు, మనలో దాగున్న ఆత్మస్థైర్యాన్ని నిద్రలేపి, మనల్ని మరింత స్ట్రాంగ్‌గా మార్చడానికి వస్తున్నాయి. సమస్యలను చూసి పారిపోకుండా, శ్రీకృష్ణుడు చెప్పినట్లు మన కర్తవ్యాన్ని మనం ధైర్యంగా చేసుకుంటూ ముందుకు సాగడమే సరైన మార్గం.

గమనిక: భగవద్గీతలోని శ్లోకాలు, కర్మ సిద్ధాంతం మరియు ఆధ్యాత్మిక గ్రంథాలలో శ్రీకృష్ణుడు తెలిపిన జీవన సూత్రాల ఆధారంగా ఈ సమాచారం అందించడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news