బిజినెస్ ఐడియా: ఇంటి నుంచే వ్యాపారం..నెలకు 20 వేలకు పైగా ఆదాయం..

-

బిజినెస్ చెయ్యాలనే ఆలోచన అందరికి ఉంటుంది..ఇంటి దగ్గర నుంచే చేసే వ్యాపారాలు బెస్ట్.. ఆలా ఇంటి నుంచి చేసే వ్యాపారం విషయానికొస్తే..మసాలా మేకింగ్ యూనిట్..ఈ బిజినెస్ కోసం తక్కువ ఎమౌంట్ తో పెట్టుబడి పెట్టవచ్చు..సుగంధ ద్రవ్యాలకు ముఖ్యమైన స్థానం ఉందని మనందరికీ తెలిసిన విషయమే. దేశంలో మిలియన్ల టన్నుల వివిధ రకాల సుగంధ ద్రవ్యాలు ఉత్పత్తి అవుతున్నాయి. వీటి నుంచి మసాలాలు తయారు చేసి విక్రయిస్తే మంచి లాభాలు పొందొచ్చు. మీ స్థానికంగా ఉండే ప్రజల ఆహారపు అలవాట్లు, వారి అభిరుచులకు అనుగుణంగా మీరు మసాలాలు తయారు చేస్తే మీరు మంచి లాభాలను పొందవచ్చు..

సుగంధ ద్రవ్యాల తయారీ యూనిట్ ఏర్పాటుకు రూ.3.50 లక్షలు ఖర్చవుతుంది. ఇందులో 300 చదరపు అడుగుల బిల్డింగ్ షెడ్డు ఏర్పాటుకు రూ.60,000, పరికరాలు రూ.40,000. ఇది కాకుండా పనులు ప్రారంభించేందుకు అయ్యే ఖర్చుకు రూ.2.50 లక్షలు అవసరం. ఈ మొత్తంలో మీ వ్యాపారం ప్రారంభమవుతుంది.మీరు ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి బ్యాంకు నుంచి రుణం కూడా తీసుకోవచ్చు. ప్రధానమంత్రి ఉపాధి పథకం కింద ఈ వ్యాపారం కోసం రుణం తీసుకోవచ్చు. ఇది కాకుండా.. ముద్ర లోన్ స్కీమ్ సహాయం కూడా తీసుకోవచ్చు..

ఏటా 193 క్వింటాళ్ల సుగంధ ద్రవ్యాలు ఉత్పత్తి అవుతాయి. ఇందులో క్వింటాకు రూ.5400 చొప్పున ఏడాదిలో మొత్తం రూ.10.42 లక్షలు సంపాధించవచ్చు. ఇందులో ఖర్చులన్నీ తీసివేస్తే ఏటా రూ.2.54 లక్షల లాభం వస్తుంది. అంటే నెలకు రూ.21 వేలకు పైగా సంపాదన తప్పక ఉంటుంది.సొంత ఇంట్లో ఈ వ్యాపారం పెడితే మరింత లాభాలను పొందవచ్చు..సోషల్ మీడియా పేజీలను కూడా తయారు చేసి మీ ప్రొడక్టులను ప్రమోట్ చేసుకోండి. ఇలా చేయడం ద్వారా మీ ప్రొడక్ట్ కు డిమాండ్ పెరిగి లక్షలు, ఇంకా క్లిక్ అయితే కోట్లు కూడా రావొచ్చు.. ఈ ఐడియా మీకు నచ్చితే మీరు కూడా ప్రారంభించండి..

Read more RELATED
Recommended to you

Exit mobile version