సెల్ఫిష్ రిపోర్టర్ కథ.. ఇదం జగత్..!

-

మళ్లీరావా సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్ రీసెంట్ గా సుబ్రహ్మణ్యపురం అంటూ వచ్చి పర్వాలేదు అనిపించుకోగా.. మరో ప్రయత్నంగా ఇదం జగత్ సినిమా చేస్తున్నాడు. అనీల్ శ్రీకంఠం డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో సుమంత్ ఓ రిపోర్టర్ గా కనిపిస్తున్నాడు. సుమంత్ సరసన అంజు కురియన్ నటించిన ఈ సినిమా ఈ నెల చివరన రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

రిపోర్టర్ గా నైట్ మొత్తం సిటీలో తిరుగుతూ తనకు వచ్చిన న్యూస్ తో బిజినెస్ చేసే పాత్రలో సుమంత్ మెప్పించాడని అనిపిస్తుంది. సినిమా కంటెంట్ కొత్తగా ఉన్నట్టు అనిపిస్తుండగా దాన్ని దర్శకుడు ఎలా డీల్ చేశాడు అన్నది తెలియాల్సి ఉంది. మరి సుమంత్ కు ఇదం జదత్ హిట్ ఇస్తుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version