BIG BREAKING : “ఆచార్య” ప్రీ – రిలీజ్ ఈవెంట్ గెస్ట్ గా సీఎం జగన్ !

-

BIG BREAKING : “ఆచార్య” చిత్ర బృందం భారీ స్కెచ్‌ వేసింది. ఆచార్య ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ఏకంగా.. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డిని.. రంగంలోకి దింపుతోంది. ఈ నెల 23 వ తేదీన ఆచార్య ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఫంక్షన్‌ విజయవాడలో జరుగనుంది.

అయితే.. ఈ ఈవెంట్‌కు ఏకంగా.. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డిని.. మెగాస్టార్‌ చిరంజీవి ఆహ్వానిస్తారని సమాచారం అందుతోంది. ఈ మేరకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఆచార్య ఫంక్షన్‌ కు సీఎం జగన్‌ వస్తే.. సినిమాకు క్రేజ్‌ పెరగడంతో పాటు.. టాలీవుడ్‌ కు, ఏపీ ప్రభుత్వానికి మధ్య ఉన్న గ్యాప్‌ తగ్గే అవకాశాలు ఉంటాయని అనుకుంటున్నారట. ఇందులో భాగంగానే… ఈ స్కెచ్‌ వేశారని తెలుస్తోంది. అయితే.. మెగాస్టార్‌ చిరంజీవి ఆహ్వానాన్ని మన్నించి.. సీఎం జగన్‌ వస్తారో, లేదో చూడాలి. కాగా.. “ఆచార్య” చిత్రం ఏప్రిల్‌ 29 వ తేదీన విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version