బాలయ్య కంటే ముందే వస్తున్న అజిత్.. ‘తునివు’ రిలీజ్ డేట్‌పై క్లారిటీ

-

సంక్రాంతి పండుగకు బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి సినిమాలు రెడీ అయ్యాయి. ఇప్పటికే బరిలో చిరంజీవి, బాలకృష్ణ, దళపతి విజయ్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే తమిళ్ హీరో అజిత్ కూడా సంక్రాంతి బరిలో నిలుస్తాడా లేదా అనే విషయంపై సందేహముండేది. ఇప్పుడు దీనిపై క్లారిటీ ఇచ్చారు ప్రొడ్యూసర్ బోనీ కపూర్.

హెచ్ వినోథ్ డైరెక్షన్‌లో అజిత్ కుమార్ నటిస్తున్న సినిమా తునివు తెలుగులో తెగింపు టైటిల్ తో రిలీజ్ అవుతోంది. ఈ సినిమా జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానున్నట్టు నిర్మాత బోనీ కపూర్ ట్వీట్ చేశారు. తునివు బాక్సాఫీస్‌ వద్ద విజయ్‌ నటిస్తోన్న వారిసుతో ఒకే రోజు బరిలోకి దిగుతుందా..? అనే డైలామాలో ఉన్న అభిమానులకు క్లారిటీ ఇస్తూ బోనీ కపూర్‌ ట్వీట్ చేయడంతో రిలాక్స్ అవుతున్నారు మూవీ లవర్స్.

ఈ చిత్రంలో మలయాళ భామ మంజు వారియర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. టాలెంటెడ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్ జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.  బాలీవుడ్ నటుడు సంజయ్‌ దత్‌, సముద్రఖని, మహానంది శంకర్‌ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version