3.30 ఎకరాలు కబ్జా చేసిన అక్కినేని నాగార్జున ?

-

అక్కినేని నాగార్జునకు చుక్కలు చూపిస్తోంది రేవంత్‌ రెడ్డి సర్కార్‌. ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను పూర్తిగా నేలమట్టం చేసింది హైడ్రా. కన్వెన్షన్ సెంటర్లోని రెండు హాళ్లు పూర్తిగా నేలమట్టం అయింది. కొన్ని గంటల్లోనే కన్వెన్షన్న్ సెంటర్లోని హాళ్ళను కూల్చివేసింది సిబ్బంది. అత్యధిక మిషనరీతో కన్వెన్షన్ సెంటర్ కి ఇవాళ ఉదయమే చేరుకున్న అధికారులు… ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను పూర్తిగా నేలమట్టం చేశారు.

Akkineni Nagarjuna who occupied 3.30 acres

కన్వెన్షన్ సెంటర్ కార్యాలయం గోడకు నోటీసులను అంటించి కూల్చివేతలు చేపట్టారు అధికారులు. ముందుగా నోటీసులు ఇస్తే కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునే అవకాశం ఉందని భావించింది హైడ్రా టీం. అందుకోసమే కూల్చివేతలకు సంబంధించి ముందస్తు నోటీసులు ఇవ్వలేదట అధికారులు. కాగా తుమ్మిడి చెరువుకు సంబంధించి 3 ఎకరాల 30 గుంటల భూమిని ఆక్రమించారని అక్కినేని నాగార్జున పై అభియోగం ఉందని సమాచారం. 3 ఎకరాల 30 గుంటల భూమిలో నిర్మించిన హాల్స్ ను నేలమట్టం చేసిన సిబ్బంది.. ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చివేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version