ఎట్టకేలకు తన సమస్య గురించి బయటపెట్టిన అనసూయ..!

-

ఒకవైపు బుల్లితెర షోలలో నటిస్తూనే మరొకవైపు సినిమాలలో నటిస్తూ మరింత పాపులానికి దక్కించుకున్న అనసూయని చూస్తే అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తూ ఉంటుంది అంటూ అభిమానులు చెబుతూ ఉంటారు. అందుకు తగ్గట్లుగానే క్రేజీ ఫోటోషూట్స్ తో గ్లామర్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈమె పోస్ట్ పెట్టగానే క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటుంది. అయితే ఆమె అందులో ఏం చెప్పిందా అని ఆసక్తిగా పోస్టులు చూస్తూ ఉంటారు. అయితే అలా పోస్ట్ చేసిన ఒక వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

ఇకపోతే తాజాగా ఈమె తన ఇన్ స్టా లో పోస్ట్ చేయగా..ఈ వీడియో చూసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు.” నేను ఓ డిజార్డర్ తో బాధపడుతున్నా.. నా గురించి నెగిటివ్ గా మాట్లాడే వారిని అసలు లెక్కచేయను..వారి గురించి పట్టించుకోకపోవడం నా రుగ్మత అని.. వేరొకరి వాయిస్ తో సింక్ చేసిన ఒక వీడియోని తన అకౌంట్లో పోస్ట్ చేసింది. అయితే సోషల్ మీడియాలో అనసూయ పెట్టిన పోస్ట్ ల వల్ల పలు కామెంట్స్ వల్ల చాలామంది ట్రోల్ చేస్తుంటారు. ఇప్పుడు వాళ్లనే టార్గెట్ చేస్తూ తన గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా.. ట్రొల్ చేసినా తాను లెక్క చేయనంటూ పరోక్షంగా ఈ వీడియో ద్వారా చెప్పే ప్రయత్నం చేసింది అనసూయ.

మరి అనసూయ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారుతుంది. మొత్తానికైతే తనపై ఎవరు ఎలాంటి కామెంట్లు చేసినా తాను లెక్క చేయనని ప్రత్యక్షంగా చెబుతోంది ఈ ముద్దుగుమ్మ మరి ఈ విషయంపై నెటిజన్లు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version