రూ.25లక్షలు విలువైన బహుమతిని పొందిన బాలయ్య.. ఇచ్చిందెవరంటే..?

-

నటసింహ బాలకృష్ణ గురించి.. ఆయన క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కేవలం ప్రేక్షకులలోనే కాదు సినీ సెలబ్రిటీలలో కూడా ఈయనకు అభిమానులు ఉన్నారు. ఇకపోతే అఖండ సినిమాతో మంచి జోష్ మీద ఉన్న బాలయ్య.. ఇప్పుడు వీర సింహారెడ్డి సినిమాతో విడుదలకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే సెన్సార్ టాక్ కి కూడా పాజిటివ్ టాక్ వచ్చింది. బాలయ్య అభిమానులు మూవీ నుంచి ఏం కోరుకుంటున్నారో ఆ అంశాలన్నీ ఈ సినిమాలో ఉంటాయని సమాచారం. ముఖ్యంగా బాలయ్య ఈ సినిమాలో తన విశ్వరూపాన్ని చూపెట్టబోతున్నాడని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఈ సినిమాలో యాక్షన్ సీన్లు చాలా ఎక్కువగా ఉన్నాయని సమాచారం. ఇకపోతే బాలయ్య ఇందులో డ్యుయల్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మొదటి రోల్ చేస్తున్న బాలయ్య పాత్ర సినిమాకు హైలైట్ గా నిలిచేలా ఉంటుందని సమాచారం. అంతేకాదు బాలయ్య, వరలక్ష్మి కాంబినేషన్లో వస్తున్న సీన్లు ఎమోషనల్ గా ఉంటాయని కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఫస్ట్ హాఫ్ లోని 20 నిమిషాల సన్నివేశాలు హైలెట్గా నిలుస్తాయని సమాచారం. ఇదిలా వుండగా జనవరి 6వ తేదీన వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్లో బాలయ్య ధరించిన వాచ్ చాలా హైలెట్ గా నిలిచింది.

దాని ఖరీదు అక్షరాల 25 లక్షలు రూపాయలు.అయితే ఈ వాచ్ ను బాలయ్య పెద్ద కుమార్తె నారా బ్రాహ్మణి బహుమతిగా ఇచ్చారని తెలుస్తోంది. బ్రాహ్మణి తండ్రి పై ఈ స్థాయిలో తన ప్రేమను చూపించారా అని నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే బాలయ్య అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఒక సినిమా చేస్తుండగా.. ఈ సినిమాని కూడా పవర్ ఫుల్ గా తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య తన తదుపరి సినిమాని ఎవరి డైరెక్షన్లో చేస్తారో తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version