తిరుమలలో ఇలాంటి వికారమైన చేష్టలా? – చిలుకూరు బాలాజీ అర్ఛకులు సీరియస్

-

 

తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం హీరోయిన్ కృతిసనన్ కు ఆదిపురుష్ డైరెక్టర్ ఓంరౌత్ ముద్దుపెట్టడంపై వివాదం కొనసాగుతోంది. ఇప్పటికే భక్తులు అభ్యంతరం చెబుతుండగా… చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ ఈ ఘటనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘తిరుమల కొండపైన ఇలాంటి వికారమైన చేష్టలు చేయకూడదు.

అక్కడ కొన్ని నియమాలు పాటించాలి. బహిరంగంగా కౌగిలింత, ముద్దు పెట్టుకోవడం చాలా దారుణమైన కార్యక్రమం’ అని మండిపడ్డాడు.కాగా, ఆదిపురుష్ మూవీ విజయం సాధించాలని కోరుతూ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్​ను మంగళవారం రోజున సాయంత్రం స్వామివారి పాదాల చెంత నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న ఉదయం చిత్ర బృందం శ్రీవారిని దర్శించుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు ఓం రౌత్, హీరోయిన్ కృతి సనన్ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ తరుణంలోనే హీరోయిన్‌ కిస్‌ ఇచ్చాడు రౌత్‌. ఆ వివాదమే ఇప్పుడు కొనసాగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version