నైరుతి వచ్చేస్తోంది.. రేపు కేరళను తాకనున్న రుతుపవనాలు

-

ఎట్టకేలకు వాతావరణ శాఖ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. నైరుతి రుతుపవనాలు రేపే దేశంలోకి ప్రవేశించనున్నాయని తెలిపింది. శుక్రవారం రోజున రుతు పవనాలు కేరళలో ప్రవేశించే అవకాశాలున్నాయని భారత వాతావరణశాఖ బుధవారం అధికారికంగా ప్రకటించింది. గతేడాది జూన్‌ ఒకటినే రాగా ఈ ఏడాది ఆలస్యంగా వస్తున్నాయి. గురు, శుక్ర, శనివారాల్లో తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు శాఖ తెలిపింది.

బుధవారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. వర్షాలు లేని ప్రాంతాల్లో గురు, శుక్రవారాల్లో.. ప్రధానంగా ఆదిలాబాద్‌, కుమురం భీం, మంచిర్యాల జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశాలున్నట్లు ప్రజలను వాతావరణశాఖ హెచ్చరించింది. బుధవారం పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు, వేడి, ఉక్కపోతలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అత్యధికంగా కరీంనగర్‌ జిల్లా తంగుళ్లలో 45.8, హైదరాబాద్‌లోని ఉప్పల్‌ వద్ద 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version