ఫొటో ఆఫ్ ది ఇయర్.. మెగా వారసులతో చిరంజీవి సెల్ఫీ

-

ఏడాదంతా ఎవరి షూటింగులతో వారు బిజీగా ఉండే మెగా ఫ్యామిలీ హీరోలు సంక్రాంతికి మాత్రం కుటుంబంతో కలిసి పండుగ సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రతి ఏటా సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి ఇల్లు వేదిక అవుతూ వస్తోంది. ఆ రోజున మెగా, అల్లు ఫ్యామిలీ సభ్యులంతా చిరు ఇంట్లో పండుగ సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే ఈ ఏడాది మెగా ఇంటికి వారసురాలు రావడం.. మరోవైపు కొత్త కోడలు (లావణ్య త్రిపాఠి) రావడంతో పండుగ సంబురం మరింత డబుల్ అయింది. అందుకే ఈ ఏడాది సంక్రాంతి సంబురాలు బెంగళూరులో ఫామ్ హౌజ్లో జరుపుకున్నారు.

ఈ సంబురాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను మెగా హీరోలు, కుటుంబ సభ్యులు ఇప్పటికే తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తున్నారు. వీటిలో తాజాగా నాగబాబు ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన ఫొటోల్లో ఓ ఫొటో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. ఈ ఫొటోలో మెగా బ్రదర్స్ చిరు, నాగబాబు, కలిసి సెల్ఫీ తీసుకుంటుండగా, వారి వెనుక మెగా వారసులు ఉన్నారు. అందులో రామ్ చరణ్, అకిరా నందన్, వరుణ్ తేజ్, ఆద్యా ఉన్నారు. ఇలా వీరిని ఒకే ఫ్రేమ్లో చూసిన ఫ్యాన్స్ “మెగా వారసులతో మెగా సెల్ఫీ” అంటూ ఈ ఫొటోను వైరల్ చేస్తున్నారు. ఇక అదే ఫొటోలో వీరితో పాటు సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, చెర్రీ సతీమణి ఉపాసన కూడా కనిపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version