సిటడెల్​ టీమ్​తో రాష్ట్రపతిని కలిసిన సమంత

-

సిటడెల్ ఇండియన్ టీమ్.. త్వరలోనే తమ అడ్వెంచరస్ వెబ్ సిరీస్​తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం ఈ టీమ్ సెర్బియాలో ఉంది. అయితే భారత రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి ద్రౌపదీ ముర్ము కూడా సెర్బియాకు వెళ్లారు. ఈ సందర్భంగా ముర్మును టాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​ సమంతతోపాటు బాలీవుడ్​ కథానాయకుడు వరుణ్​ ధావన్​ కలిశారు. వీరితో పాటు ‘సిటడెల్’ వెబ్​సిరీస్​ దర్శకులు రాజ్, డీకే కూడా ఉన్నారు. ముర్ముతో కాసేపు వీరంతా ముచ్చటించారు. ఈ మీటింగ్​కు సంబంధించిన ఫొటోలను ఇటు సామ్.. అటు వరుణ్.. తమ సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు.

“సిటాడెల్ టీమ్​కు​.. భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిసే అదృష్టం దక్కింది. ఇది మాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాం. మిమ్మల్ని (ద్రౌపదీ ముర్ము) కలవడం ఎంతో ఆనందంగా ఉంది” అంటూ వరుణ్​ ధావన్​ రాసుకొచ్చారు. అయితే వరుణ్​ పోస్ట్​ను సమంత ఇన్​స్టాలో రీషేర్​ చేసింది. “మేడమ్ ప్రెసిడెంట్” అంటూ రాసుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version