క‌రోనా ఎఫెక్ట్ : అజిత్ వలిమై వాయిదా

-

దేశంలో క‌రోనా వైర‌స్, ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి పెరుగుతుడ‌టంతో సినిమా ఇండ‌స్ట్రీపై తీవ్ర ప్ర‌భావం చూపుతుంది. ఇప్ప‌టికే యంగ్ టైగ‌ర్ ఎన్టీర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ తేజ్, డైరెక్ట‌ర్ రాజ‌మౌళీ కాంబోలో వ‌స్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు పాన్ ఇండియా స్టార్ రాధేశ్యామ్, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ భీమ్లా నాయ‌క్ తో పాటు ప‌లు సినిమాలు వాయిదా ప‌డ్డాయి. తాజా గా త‌మిళ స్టార్ హీరో అజిత్ కుమార్ న‌టించిన వ‌లిమై సినిమాను కూడా వాయిదా వేస్తున్న‌ట్టు చిత్ర నిర్మాత‌లు ప్ర‌క‌టించారు.

ముందుగా ఈ సినిమా సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 13 న పాన్ ఇండియా రెంజ్ లో తెలుగు, త‌మిళ, హిందీ భాషాల‌లో విడుద‌ల చేయాల‌ని చిత్ర బృందం భావించింది. అయితే క‌రోనా, ఓమిక్రాన్ కేసులు పెర‌గ‌డం తో ప‌లు రాష్ట్రాల‌లో రాత్రి క‌ర్ఫ్యూలు, థీయేట‌ర్స్ ల‌లో నిబంధ‌న‌లు విధిస్తున్నారు. అలాగే త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం కూడా ప‌లు ఆంక్ష‌లను అమ‌లు చేస్తుంది. దీంతో ఈ సినిమాను వాయిదా వేయాల‌ని చిత్ర బృందం ప్ర‌క‌టించింది. అయితే ఈ సినిమా మ‌ళ్లీ ఎప్పుడు విడుదల చేయాల‌నే విష‌యాన్ని చిత్ర బృందం ప్ర‌క‌టించ‌లేదు.

Read more RELATED
Recommended to you

Latest news