మహేష్ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈ పాప.. స్టార్ హీరోయిన్ అని మీకు తెలుసా..?

-

హీరో హీరోయిన్ల కంటే చైల్డ్ ఆర్టిస్టులకి ఎక్కువ క్రేజ్ ఉంటుందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే మహేష్ బాబు హీరోగా యువరాజు సినిమాలో కనిపించిన చైల్డ్ ఆర్టిస్టు ఇప్పుడు ఒక స్టార్ హీరోయిన్ అని చాలామందికి తెలియదనే చెప్పాలి. ఇక ఆమె గురించి మనం ఇప్పుడు చదివి తెలుసుకుందాం.. తెలుగు సినీ ఇండస్ట్రీలో మనసారా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయ్యింది చైల్డ్ ఆర్టిస్టు శ్రీదివ్య. ప్రస్తుతం హీరోయిన్ గా తెలుగు , తమిళ్ సినిమాలలో ప్రేక్షకులను బాగా అలరిస్తోందని చెప్పవచ్చు.3 ఏళ్ల వయసున్నప్పుడే తన నటనను ప్రారంభించిన శ్రీదివ్య.. 2000 సంవత్సరంలో వచ్చిన హనుమాన్ జంక్షన్ , యువరాజు చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత రవితేజ హీరోగా నటించిన వీడే సినిమాలో కూడా నటించింది. ఇక 2010లో హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వడమే కాకుండా తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది.నిజానికి తెలుగులో పెద్దగా గుర్తింపు రాకపోయినా తమిళ్ ఇండస్ట్రీలో మాత్రం శ్రీదివ్యకు మంచి గుర్తింపు లభించింది. శివ కార్తికేయన్, కార్తీ, విశాల్ వంటి హీరోల సరసన నటించిన శ్రీదివ్య హైదరాబాదులో పుట్టి పెరిగిన తెలుగమ్మాయి. బుల్లితెరపై పలు టీవీ సీరియల్స్ లో కూడా నటించింది.. ఇక రవిబాబు దర్శకత్వంలో వచ్చిన మనసారా సినిమాతో హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమైంది. బస్ స్టాప్ సినిమాతో కమర్షియల్ హిట్ నీ తన ఖాతాలో వేసుకుంది. ఇక తర్వాత మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు, కేరింత, వారధి వంటి సినిమాలలో కూడా నటించింది. తర్వాత తమిళ్లో పెన్సిల్, కాష్మోరా వంటి సినిమాలలో నటించిన తర్వాత చాలాకాలం గ్యాప్ తీసుకుంది శ్రీదివ్య.

ఇప్పుడు చాలా కాలం తర్వాత మలయాళం సినిమా జనగణమనలో కూడా నటించింది. ఇక ఇప్పుడు శ్రీదివ్య ఆశలు మలయాళం ఇండస్ట్రీ వైపు ఉన్నట్లు సమాచారం. ఏది ఏమైనా శ్రీదివ్య తెలుగులో అవకాశాలను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version