స్టార్ సెలబ్రిటీల అద్భుతమైన డ్రెస్ సెన్స్ వెనుక ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా..?

-

సాధారణంగా సినిమా వేడుకలలో హీరో హీరోయిన్లు రెడ్ కార్పెట్ మీద నడవడం అనేది ఒక గొప్ప అరుదైన గౌరవంగా భావిస్తారు.. అంతేకాదు ఆ అడుగులలో హుందాతనం ఉట్టిపడేలా.. వ్యక్తిత్వం కనిపించేలా క్రమశిక్షణకు మారుపేరుగా తమ నడకతో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటారు. ఇదే సమయంలో అందరి చూపులు కూడా కార్పెట్ మీద నడిచే హీరో , హీరోయిన్ల పైనే కాదు.. వారు వేసుకున్న డ్రెస్ మీద కూడా ఉంటాయి. ఈ క్రమంలోనే ఒక డ్రెస్ డిజైనర్ గురించి చర్చ ఇప్పుడు నెట్టింట చాలా వైరల్ గా మారుతుంది అతడే గౌరవ్ గుప్తా..

తెలుగు సినిమాను ఎవరెస్టు శిఖరం పై నిలబెట్టిన ఆర్ఆర్ఆర్ సినిమా గురించి, ఆ ప్రత్యేకత గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆస్కార్ వేదికపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ వేసుకున్న దుస్తులు రూపొందించింది ఎవరో తెలుసా ఆయనే గౌరవ్ గుప్తా.. దాదాపు రెండు దశాబ్దాలుగా ఫ్యాషన్ డిజైనింగ్ లో రాణిస్తూ ఎంతోమంది సెలబ్రిటీల అభిమాన డిజైనర్ గా పేరు దక్కించుకున్న ఈయన.. తాను రూపు దిద్దిన దుస్తులతో రెడ్ కార్పెట్ పైన నడిచిన ఐశ్వర్యరాయ్, అనన్య పాండే బెస్ట్ డ్రెస్డ్ రెడ్ కార్పెట్ లుక్స్ అనిపించకున్నారు.

ఇకపోతే 2023 గ్రామీ అవార్డు ఫంక్షన్ లో వరల్డ్ ఫేమస్ ర్యాప్ సింగర్ కార్డి బీ అవార్డ్స్ ప్రెజెంటర్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఆ వేడుకలో ఆమె గౌరవ్ తయారుచేసిన నీలి వన్నె వస్త్రధారణలో మెరిసిపోయింది. ఇక ఇలా ఎన్టీఆర్ ను మొదులుకొని ఐశ్వర్యరాయ్ వరకు ప్రతి ఒక్కరికి అద్భుతమైన డ్రెస్సులను డిజైన్ చేసి ఇచ్చారు గౌరవ్. ఇకపోతే “వాణిజ్య రాజధాని ముంబై కి వచ్చిన వారంతా మా స్టోర్ ను సందర్శించాలి ఇదే నా కోరిక” అని చెబుతూ ఉంటారు గౌరవ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version