ఘనంగా నేషనల్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం

-

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో నేషనల్ అవార్డులకు ఉండే ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తాజాగా  70వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవ కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా విజేతలు పురస్కారాలు అందుకున్నారు. 2022వ సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ఉత్తమ చిత్రాలు, నటులు, నటీమణులు, సాంకేతిక నిపుణులను ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.


ఉత్తమ నటుడి గా రిషబ్ శెట్టి(కాంతార), ఉత్తమ నటి గా నిత్యమీనన్ (తిరుచిత్రంబలం), మానసి
పరేఖ్ (కచ్ ఎక్స్ ప్రెస్) అవార్డులు అందుకున్నారు. ఇక ఉత్తమ సంగీత దర్శకునిగా ఏఆర్ రహమాన్
‘పొన్నియన్ సెల్వన్’ చిత్రానికి పురస్కారం అందుకున్నారు. ఉత్తమ చిత్రంగా ‘ఆట్టమ్'(మలయాళం)
ఎన్నికవగా.. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా తెలుగు నుంచి ‘కార్తికేయ-2’ ఎన్నికైంది. ఈ చిత్ర
దర్శకుడు చందూ మొండేటి, నిర్మాత అభిషేక్ అగర్వాల్ అవార్డు అందుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version