BREAKING : మర్డర్ కేసులో స్టార్ హీరో అరెస్టు

-

కన్నడ స్టార్ హీరో దర్శన్ తూగుదీప ఓ మర్డర్ కేసులో అరెస్టయ్యారు. ఇవాళ ఉదయం మైసూరులో ఆయనతో పాటు మరో పది మందిని బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం బెంగళూరుకు తరలించినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. ఇంతకీ ఏం జరిగిందంటే?

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూన్‌ 8వ తేదీన రేణుకా స్వామి అనే మహిళ హత్యకు గురైంది. ఆ మరుసటి రోజు కామాక్షిపాళ్యం సమీపంలోని ఒక కాలువలో ఆమె మృతదేహం కనిపించింది. మృతురాలిది చిత్రదుర్గ అని పోలీసులు తెలిపారు. ఈ కేసులో దర్శన్‌పై ఆరోపణలు వచ్చాయి. విచారణలో భాగంగా నిందితుడు దర్శన్‌ పేరు వెల్లడించారని చెప్పారు. అతడితో నటుడు నిరంతరం టచ్‌లో ఉండేవాడని సమాచారం. ఈ క్రమంలోనే ఈ కేసు దర్యాప్తు నిమిత్తం ఆయన్ను కస్టడీలోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం.. దర్శన్ భార్యకు రేణుకా స్వామి అసభ్యకరమైన సందేశాలు పంపినట్లు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version