ట్రైలర్ కోసం థియెటర్ ను ధ్వంసం చేసిన ఫ్యాన్స్..ఎక్కడంటే?

-

తమ అభిమాన హీరోల సినిమాలు వస్తున్నాయి అంటే ఫ్యాన్స్ హంగామా మాములుగా ఉండదు.. సినిమాకు కొబ్బరి కాయ కొట్టినప్పటి నుంచి సినిమా షూటింగ్ పూర్తి అయ్యేవరకు ఒక రచ్చ ర‌చ్చ చేస్తారు. గోల గోల చేస్తారు. ఇక త‌మ అభిమాన హీరో విడుదల అవుతుంది అంటే థియేటర్లను అందంగా ముస్తాబు చేసి అంద‌రికీ స్వాగతం పలుకుతారు. ఆ సినిమా కథ బాగుంది అనుకుంటే గట్టిగానే పబ్లిక్ టాక్, ప్రమోషన్స్ ఇస్తారు. ఆ సినిమా హిట్ అయ్యిందంటే వారి క‌న్నా సంతోషించే వారు మరొకరు ఉండరు. అందుకే స్టార్ హీరోలకు అంత క్రేజ్ !

నిన్న‌టి మొన్న‌టి వేళ ఆర్ఆర్ఆర్ సినిమా పై అసంతృప్తి వ్యక్తం చేసిన ఫ్యాన్స్ సినిమా థియేటర్లను ధ్వంసం చేశారు. ఇప్పుడు స‌ర్కారు వారి పాట సినిమా ట్రైలర్ విడుద‌ల స‌మ‌యంలో ఒక థియేట‌ర్ నే ధ్వంసం చేశారు. హైదరాబాద్ కూకట్పల్లిలోని భ్రమరాంబ థియేటర్లో మహేశ్ బాబు ఫ్యాన్స్ హల్చల్ చేసి, విధ్వంస‌కాండ‌కు కార‌ణం అయ్యారు. ట్రైల‌ర్ విడుద‌ల సంద‌ర్భంలో మహేశ్ బాబు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో థియేటర్ అద్దాలు ధ్వంసం అయ్యాయి. పలువురు అభిమానులకు గాయాలు కూడా అయినట్లు తెలుస్తుంది. వాళ్ళు ఎందుకు అలా చేశారా అనేది మాత్రం తెలియలేదు..మొత్తానికి కాసేపు థియేటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version