లండన్‌లో ఫ్యామిలీతో మహేశ్‌బాబు డిన్నర్‌ డేట్​.. ఫొటోలు వైరల్‌

-

షూటింగ్స్ మధ్య కాస్త గ్యాప్ దొరికినా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తన ఫ్యామిలీతో విహారానికి చెక్కేస్తుంటారు. తాజాగా మహేశ్ బాబు తన సతీమణి నమ్రతతో కలిసి లండన్​లో విహారయాత్రకు వెళ్లారు. అక్కడ తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్​తో కలిసి ఓ రెస్టారంట్‌లో డిన్నర్‌ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను నమత్రా సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘లండన్‌ కాలింగ్‌’ అని క్యాప్షన్‌ పెట్టారు.

ఈ ఫొటోలు పోస్టు చేసిన క్షణాల్లోనే వైరల్‌గా మారాయి. ఈ ఫొటోల్లో మహేశ్ ఎల్లో కలర్ టీ షర్ట్​లో పదహారేళ్ల యంగ్ బాయ్​గా కనిపించారు. రోజురోజుకు మహేశ్ మరింత అందంగా తయారవుతున్నారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఏం తింటున్నావ్ అన్నా.. ఇంత హ్యాండ్సమ్​గా ఉన్నావ్ అంటూ కుర్రాళ్లు ఈ సూపర్ స్టార్ బ్యూటీ సీక్రెట్​ అడిగేస్తున్నారు.

ఇక మహేశ్ సినిమాల గురించి వస్తే తాజాగా త్రివిక్రమ్​తో కలిసి గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు. కొన్ని రోజుల నుంచి ‘గుంటూరు కారం’ షూటింగ్‌తో బిజీగా ఉన్న మహేశ్‌ కొన్ని రోజులు బ్రేక్‌ ఇచ్చినట్టు ఈ పోస్ట్‌తో అర్ధమవుతోంది. శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలు. ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత మహేశ్‌- త్రివిక్రమ్‌ కాంబోలో రూపొందుతోన్న సినిమాకావడంతో ‘గుంటూరు కారం’పై ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version