హైదరాబాద్ ఓటర్లపై మంచు లక్ష్మి సీరియస్‌

-

హైదరాబాద్ ఓటర్లపై మంచు లక్ష్మి సీరియస్‌ అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఏపీలోని మొత్తం 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలకు, తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో సోమవారం ఓటింగ్‌ కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు.

manchu laxmi warns voters

ఉదయం 9 గంటల వరకు లోక్‌సభకు ఏపీలో 9.05శాతం పోలింగ్‌ నమోదైంది. అయితే… ఈ తరుణంలోనే…హైదరాబాద్ ఓటర్లపై మంచు లక్ష్మి సీరియస్‌ అయ్యారు. హైదరాబాద్ నగరంలో లో ఇప్పటివరకు 5 శాతమే ఓట్లు నమోదు కావడం సిగ్గుచేటు అన్నారు. FNCC లో ఓటు హక్కు వినియోగించుకున్న తరువాత మీడియా తో మంచు లక్ష్మి మాట్లాడుతూ… నేను కేవలం ఓటు హక్కు వినియోగించుకోవటం కోసం ముంబాయి నుంచి హైదరాబాద్ వచ్చాను కానీ హైదరాబాద్ లో ఉన్నవారు తమ ఓటు హక్కు వినియోగించుకోవటం బయటికి రాకపోవడం దారుణం అన్నారు. నగర ప్రజలు బయటికి వచ్చి ఓటు వేయాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version